అనన్య న్యూస్, జడ్చర్ల: మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట డాక్ (ఐబి) బంగ్లా సమీపంలో 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవాలయంలో మంగళవారం మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకొని భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవతకు అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షులు నరేందర్, సభ్యులు, భక్తులు, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు.
JCL: బంగారు మైసమ్మకు సంక్రాంతి ప్రత్యేక పూజలు..
RELATED ARTICLES