అనన్య న్యూస్, హైదరాబాద్: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జూపల్లి కృష్ణారావుకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. జూపల్లితో పాటు మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి లు కాంగ్రెస్ లో చేరారు. కార్యక్రమంలో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఉన్నారు. మహబూబ్ నగర్ లో ప్రియాంక గాంధీతో భారీ బహిరంగ సభ నిర్వహించి కాంగ్రెస్ పార్టీలో చేరాలని జూపల్లి కృష్ణారావు భావించారు. అయితే, తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రియాంక గాంధీ సభ వాయిదా పడడంతో ఢిల్లీలో ఆయన కాంగ్రెస్ జాయిన్ అయ్యారు.