ఢిల్లీలో ముగిసిన దీక్ష
న్యూఢిల్లీ, అనన్య న్యూస్: మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శుక్రవారం ఢిల్లీలో చేపట్టిన నిరాహార దీక్ష విజయవంతం అయ్యింది. సాయంత్రం 4గంటలకు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎంపీ కే. కేశవరావు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు ఒక్క రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదని తెలిపారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం మా పోరాటం కొనసాగుతోంది. మహిళా రిజర్వేషన్ సాధించే వరకు విశ్రమించేది లేదు. మోదీ సర్కార్ తలచుకుంటే ఈ బిల్లు పాసవుతుంది. డిసెంబర్లో పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు పోరాడుతూనే ఉంటాము. రాష్ట్రపతికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ ప్రారంఇంచిన ఈ పోరాటం ఇంకా ఉధృతమవుతుంది. మహిళా బిల్లు ఓ చారిత్రక అవసరం.. సాధించి తీరాలి అని కవిత స్పష్టం చేశారు.
మద్దతు ప్రకటించిన పార్టీలకు ప్రత్యేక ధన్యవాదాలు..
మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం చేపట్టిన దీక్షకు మద్దతు ఇచ్చిన పార్టీలకు ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దీక్షకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. ఢిల్లీ మహిళా నేతలకు, విద్యార్థి నేతలకు ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు కవిత. ఈ దీక్షకు మొత్తం 18 పార్టీలు సంఘీభావం ప్రకటించాయి.