అనన్య న్యూస్, హైదరాబాద్: మే 18వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. తెలంగాణ సచివాలయంలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. మంత్రులతోపాటు పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. కాగా, కొత్త సచివాలయంలో ఇది తొలి కేబినెట్ సమావేశం కావడం గమనార్హం. ఈ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇది ఇలావుండగా, బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ, పార్లమెంటరీ పార్టీల సమావేశం మే 17వ తేదీన జరగనుంది.