అనన్య న్యూస్, హైదరాబాద్: తెలంగాణ నూతన సచివాలయం ఏప్రిల్ 30న ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. సచివాలయ ప్రారంభానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు ఇలా దాదాపు 2500 మంది హాజరుకానున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ లీడర్ బండి సంజయ్ కు కూడా ఆహ్వానం అందింది. దీనిపై బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను సచివాలయ ప్రారంభోత్సవానికి వెళ్లబోనని అన్నారు. అది సెక్రటేరియట్ లా కన్పించడం లేదని ఓవైసీ కళ్లల్లో ఆనందం కోసం ఒక వర్గం వాళ్లను సంతృప్తి పరచడానికే కట్టినట్టుందన్నారు.
బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ సంస్క్రతికి అనుగుణంగా మార్పులు చేసిన తర్వాతే సచివాలయానికి వెళ్తానన్నారు. నల్లపోచమ్మ ఆలయానికి రెండున్నర గుంటలు కేటాయిస్తే, మసీదుకు 5 గుంటలుఇస్తారా? తెలంగాణలోని హిందూ సమాజమంతా ఒక్కసారి ఆలోచించాలన్నారు. కేసీఆర్ పాలనలో హిందువులంతా బాంచన్ బతుకులు బతకాలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ సంస్కృతికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తామని ఆతర్వాతే కొత్త సచివాలయంలోకి అడుగుపెడతామని బండి సంజయ్ ప్రకటించారు.