Monday, March 10, 2025

యువతలో గుండెపోటు, కోవిడ్ మధ్య సంబంధం ఉందా ? పరిశోధనలు చేస్తున్నాం: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి

  • యువతలో గుండెపోటు, కోవిడ్ కు మధ్య సంబంధంపై అధ్యయనానికి ప్రభుత్వం ఆదేశం
  • రెండు, మూడు నెలల్లో నివేదిక వస్తుందని మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడి
  • కోవిడ్ కేసుల పెరుగుదలను ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు సిద్ధంమని ప్రకటన

అనన్య న్యూస్: ఇటీవల కాలంలో యువత కూడ గుండెపోటుతో మరణిస్తున్న ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ స్పందించారు. మంగళవారం ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి సారించిందని పేర్కొన్నారు. యువతలో గుండెపొటు కేసులకు, కొవిడ్‌కు ఏదైనా సంబంధం ఉందా అని తేల్చేందుకు ప్రభుత్వం ఓ అధ్యయనానికి ఆదేశించిందని, దీని తాలుకు ఫలితం రెండు, మూడు నెలల్లో వస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఎందరో యువ ఆర్టిస్టులు, అథ్లెట్లు, క్రీడాకారులు అకస్మాత్తుగా కుప్పకూలిన ఘటనలు మనం చూశాం. ఈ ఘటనలపై కచ్చితంగా అధ్యయనం చేయాలి అని మంత్రి వ్యాఖ్యానించారు.

ఇక దేశంలో మొత్తం 214 కరోనా వేరియంట్లు వ్యాప్తిలో ఉన్నట్టు మంత్రి తెలిపారు. వీటిల్లో కొన్ని ఉపవేరియంట్ల కారణంగా ప్రస్తుతం కేసుల సంఖ్య పెరుగుతోందన్నారు. ఈ వేరియంట్లేవీ భారీ సంక్షోభాలు కలిగించేంతటి ప్రమాదకరమైనవి కావని ఆయన స్పష్టం చేశారు. ఇక కేసుల్లో పెరుగుదలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి భరోసా ఇచ్చారు. ఐసీయూ బెడ్లు, ఆక్సిజన్, ఇతర అత్యవసర ఏర్పాట్లు అన్నీ రెడీగా ఉన్నాయని వివరించారు.

Ananya News
Ananya Newshttps://ananyanews.in
Ananya News is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular