అనన్య న్యూస్, జడ్చర్ల: జీలుగ సాగుతో రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. జడ్చర్ల పట్టణంలోని ఆగ్రో రైతు సేవ కేంద్రం 2లో వ్యవసాయ సహకార శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సబ్సిడీ జీలుగ విత్తనాల కేంద్రాన్ని శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు సబ్సిడీ జీలుగ విత్తనాలను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతులకు ప్రాధాన్యతను ఇస్తూ రైతుల సంక్షేమానికి పాటు పడుతున్నారని, దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుల అభివృద్ధికోసం సంక్షేమ పథకాలను తీసుకొస్తున్నారని, రైతు సహకార సంఘం ద్వారా 65 శాతం సబ్సిడీపై రైతులకు జీలుగా విత్తనాలను పంపిణీ చేస్తున్నామని రైతులు సద్వినిగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, రైతుబంధు అధ్యక్షులు జంగయ్య, మార్కెట్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, వ్యవసాయ అధికారులు, కౌన్సిలర్లు, మూడా డైరెక్టర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జీలుగ సాగుతో రైతులకు మేలు: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
RELATED ARTICLES