అనన్య న్యూస్, జడ్చర్ల: మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట డాక్ (ఐబి) బంగ్లా సమీపంలో 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవాలయంలో శుక్రవారం పౌర్ణమి పురస్కరించుకొని భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవతకు అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ గోనెల నరేందర్ మహేశ్వరి దంపతులు, ఉపాధ్యక్షులు గుండు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి జి. విజయ్ కుమార్, కమిటీ సభ్యులు, భక్తులు, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు.
