- అది గుడైన, బడైన నేను మాత్రం ప్రజల వెంటే..
- డబ్బులు వస్తాయి, పోతాయి కానీ ప్రజల గుండెల్లో స్థానం మాత్రం పదిలం..
- బిఆర్ఎస్ యువ నాయకులు చించోడ్ అభిమన్యు రెడ్డి..
అనన్య న్యూస్, జడ్చర్ల: మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట (డాక్) ఐబి బంగ్లా సమీపంలో 44వ జాతీయ రహదారి పక్కన భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవాలయ నిర్మాణానికి, అభివృద్ధి నిమిత్తం బిఆర్ఎస్ యువ నాయకులు చించోడ్ అభిమన్యు రెడ్డి రూ.1.50 వేల రూపాయల నగదును విరాళంగా అందజేశారు.
24వ వార్డు కౌన్సిలర్ కోట్ల ప్రశాంత్ రెడ్డి, 2వ వార్డు కౌన్సిలర్ బుక్క మహేష్, నాయకులు బి. కృష్ణా రెడ్డి, లింగం, మహేష్ గౌడ్ లు ఆదివారం దేవాలయాన్ని సందర్శించి బంగారు మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి రూ.1.50 రూపాయల చెక్కును దేవాలయ కమిటీ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా కోట్ల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ బిఆర్ఎస్ యువ నాయకులు అభిమన్యు రెడ్డి దేవాలయాల, బడుల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందజేయడంలో ముందుంటారని, అందులో భాగంగానే శ్రీ బంగారు మైసమ్మ దేవాలయ అభివృద్ధి నిమిత్తం రూ. 1లక్ష 50 వేల రూపాయల చెక్కును అందజేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు గోనెల నరేందర్, గుండు చంద్రశేఖర్, మిద్దె నాగరాజు, జయ శ్రీవాత్సవ్ తదితరులు ఉన్నారు.