- ప్రతి వార్డుకు సీసీ, డ్రైనేజీలు 100శాతం పూర్తి చేస్తాం.
- స్వరాష్ట్రంలోనే పారిశుద్ధ్యం మెరుగైంది.
- జడ్చర్ల మున్సిపాలిటీలో రూ.35 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన.
అనన్య న్యూస్, జడ్చర్ల: జడ్చర్ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధిని తొమిదేళ్ల క్రితానికి ఇప్పటికి బెరీజు వేసుకోవాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రజలను కోరారు. అన్ని వార్డుల్లో వంద శాతం సిసి రోడ్లు, డ్రైనేజీలు నిర్మించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. సోమవారం రూ.35.00 లక్షలతో జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో 1వ వార్డులోని క్రిస్టియన్ కాలనీలో సీసీ డ్రైన్, 11వ వార్డు లోని బొడ్రాయి వద్ద చేపట్టనున్న సిసి రోడ్డు, 8వ వార్డు హౌసింగ్ బోర్డ్ లో ఉర్దూఘర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 9 ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో పల్లెల్లో, పట్టణాల్లో పారిశుద్ధ్యం మెరుగైందని, మౌలిక వసతులు కూడా పెరిగాయని చెప్పారు. గ్రామ పంచాయతీలో, మున్సిపాలిటీల్లో నిత్యం చెత్త సేకరణ, డంపింగ్ యార్డ్ ఏర్పాటు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాలతో పారిశుద్ధ్యం మెరుగైందన్నారు. అన్ని వర్గాలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని, ప్రతి కుటుంబం ఏదో ఒక రూపంలో ప్రభుత్వం నుంచి సంక్షేమ ఫలాలు పొందుతుందన్నారు.
గత 9 ఏళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గమనించాలని పనిచేసే ప్రభుత్వనికి మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి, కౌన్సిలర్లు మహేష్, జ్యోతి, రమేష్, నాయకులు దోరేపల్లి రవీందర్, రామ్మోహన్, ఇర్ఫాన్, షేక్ బాబా, మురళి తదితరులు పాల్గొన్నారు.