అనన్య న్యూస్, జడ్చర్ల: మూడు గంటల కరెంటు చాలు అన్న కాంగ్రెస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ జడ్చర్ల నియోజకవర్గంలోని చిన్నఆదిరాల, బొమ్మరాసిపల్లి గ్రామాలకు చెందిన సుమారు 200 మందికి పైగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కుల సంఘాల నాయకులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గురువారం జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నివాసంలో పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఎల్లపుడు రైతుల సంక్షేమం కొరకు పాటుపడుతున్న బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నిరంతరయంగా పార్టీలో చేరికలు జరుగుతున్నాయని అన్నారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ తాము 70 ఏళ్లుగా కరెంటు కష్టాలు అనుభవించామని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలోనూ ఏడు గంటలు ఇస్తామని మూడు గంటలు కరెంటు ఇచ్చేవారని అది కూడా సక్రమంగా సరఫరా వచ్చేది కాదన్నారు. తిరిగి కరెంటు కష్టాలను చూడలేమని నిరంతరంగా రైతులకు కరెంటు అందిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వమే కావాలని పార్టీలో చేరినట్లు స్పష్టం చేశారు.
రైతులను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న పార్టీ బీఆర్ఎస్ అని, తామంతా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అడుగుజాడల్లో నడుస్తామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, నాయకులు రఘుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.