Saturday, March 15, 2025

HYD: శనివారం మధ్యాహ్నం నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..

  • త్వరలో మహిళలకు మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు..ఆర్టీసీ ఎండి సజ్జనార్..

అనన్య న్యూస్, హైదరాబాద్: తెలంగాణాలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం రాష్ట్ర మహిళలకు శుభవార్తను తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళల కోసం చేపట్టిన మహాలక్ష్మి పథకం శనివారం మధ్యాహ్నం నుంచి అమలులోకి వస్తుంది. ఈ పథకం కింద రాష్ట్రంలోని మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. ఈమేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాన్స్ జెండర్లకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. మహాలక్ష్మి పథకానికి అయ్యే ఖర్చును ప్రభుత్వం ఆర్టీసికి చెల్లిస్తుంది.

త్వరలో మహిళలకు మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు: తెలంగాణాలో ఏర్పాటైన కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మహాలక్ష్మి పథకం శనివారం మధ్యాహ్నం నుంచి అమలులోకి వస్తుందని ఆర్టీసీ ఎండి సజ్జనార్ శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. త్వరలో మహిళలకు మహాలక్ష్మి స్మార్ట్ కార్డులను అందిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు.

ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాన్స్ జెండర్లకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. మహాలక్ష్మి పథకానికి అయ్యే ఖర్చును ప్రభుత్వం ఆర్టీసికి చెల్లిస్తుంది. రేపు మధ్యాహ్నం 1:30 గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలో మహాలక్ష్మి ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రేడ్డి ప్రారంభించనున్నారు. మహాలక్ష్మి పథకం వల్ల ప్రజా రవాణాకు మేలు జరుగుతుందని సజ్జనార్ తెలిపారు. కొవిడ్ వల్ల ప్రజారవాణాకు తీవ్ర విఘాతం కలిగిందన్నారు. మహాలక్ష్మి పథకం వల్ల ప్రజా రవాణా పుంజుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

Ananya News
Ananya Newshttps://ananyanews.in
Ananya News is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular