Thursday, March 27, 2025

HYD: 466 అత్యవసర సేవల వాహనాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌..

అనన్య న్యూస్, హైదరాబాద్: ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా ఎమర్జెన్సీ సేవలను ప్రభుత్వం మరింత పటిష్ఠం చేస్తున్నది. ఇందులో భాగంగా మంగళవారం హైదరాబాద్‌ పీపుల్స్‌ ప్లాజా వద్ద 466 అమ్మ ఒడి, అంబులెన్స్‌, పార్థివదేహాల తరలింపు వాహనాలను సీఎం కేసీఆర్‌ జెండాఊపి ప్రారంభించారు. ఇందులో 204 అంబులెన్స్‌లు (108), 228 అమ్మఒడి వాహనాలు, 34 హర్సె వెహికిల్స్‌ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌ రావు, మహమూద్‌ అలీ, ఎమ్మెల్సీ వాణీ దేవి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పాల్గొన్నారు. అనంతరం సీఎం కేసీఆర్‌ మహారాష్ట్ర పర్యటనకు బయల్దేరారు.

Ananya News
Ananya Newshttps://ananyanews.in
Ananya News is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular