అనన్య న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో మరో వారం రోజుల్లో డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేయనున్నట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం 70 వేల ఇండ్లు అందుబాటులో ఉన్నాయని. వెరిఫికేషన్ కూడా పూర్తయ్యిందని చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీపై మంత్రి కేటీఆర్ బుధవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారం రోజుల్లో తొలివిడత ఇండ్ల పంపీణీ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వెరిఫికేషన్ ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చిందని కేటీఆర్ తెలిపారు.
70 వేల ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారని. 70 వేల ఇండ్లను 5 లేదా 6 దశల్లో వేగంగా అందిస్తామన్నారు. వచ్చే వారంలోనే తొలి దశ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తామని మంత్రికేటీఆర్ ప్రకటించారు. ఈ సమావేశానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి, పద్మారావు, జీహెచ్ఎంసీ అధికారులు హాజరయ్యారు.