అనన్య న్యూస్, హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి ఉపఎన్నికలో మహబూబ్ నగర్ శాసన మండలి స్థానానికి గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సీటుకు బిఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి మన్నే జీవన్ రెడ్డి, స్వతంత్ర్య అభ్యర్థి సుదర్శన్ గౌడ్ పోటీపడుతున్నారు. పదవీరీత్యా కొడంగల్ ఎంఎల్ఏగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని 10 పోలింగ్ స్టేషన్లలో స్థానిక సంస్థల ప్రాతినిధ్య ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. ఎంఎల్సి కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామా చేయడంతో ఈ ఉపఎన్నిక చోటుచేసుకుంది. ఓట్ల లెక్కింపు ఏప్రిల్ 2న జరుగనున్నది.