అనన్య న్యూస్, హైదరాబాద్: తెలంగాణలోని దివ్యాంగులకు సీఎం కేసీఆర్ శుభవార్త తెలిపారు. దివ్యాంగులకు ఆసరా పెన్షన్లను రూ.4016 పెంచుతూ శనివారం సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. పెంచిన పెన్షన్ జులై నెల నుంచి అమలులోకి రానుందని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 5లక్షల మంది దివ్యాంగులకు లబ్ధి కలుగనున్నది. పెన్షన్ల పెంపుపై మంత్రులు హర్షం వ్యక్తం చేస్తూ కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. పెన్షన్ల పెంపుపై ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు హర్షం వ్యక్తం చేశారు. దేశంలో మునుపెన్నడూ లేనివిధంగా దివ్యాంగులకు రూ.4016కు పెన్షన్ పెంచినట్లు తెలిపారు. చారిత్రాత్మక నిర్ణయంతో 5లక్షల మందికిపైగా దివ్యాంగులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. పెన్షన్ల పెంపు బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమంటూ ట్వీట్ చేశారు.
Hyd: ఆసరా పెన్షన్ రూ.4016 పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు..
RELATED ARTICLES