అనన్య న్యూస్, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ పేరిట చౌక ధరకే బియ్యం అందించనుంది. మార్కెట్లో ఆకాశాన్నంటుతున్న బియ్యం ధరలను అదుపు చేసేందుకు కిలో 29 రూపాయలకే బియ్యాన్ని అందించబోతోంది. బియ్యం అమ్మకాలు వచ్చే వారం నుంచే ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు. భారత్ బియ్యాన్ని 5 కేజీలు, 10 కేజీల బ్యాగులలో నాఫెడ్, ఎన్సీసీఎఫ్, కేంద్రీయ భండార్ రిటైల్ షాపుల్లో విక్రయిస్తామని అన్నారు. ఇ-కామర్స్ లోనూ కొనుగోలు చేయవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కిలో రూ. 27.50కు భారత్ గోధుమ పిండిని, రూ. 60కి భారత్ దాల్ పేరిట శనగపప్పుని విక్రయిస్తున్న సంగతి తెలిసిందే.
Bharath Rice: మార్కెట్లోకి భారత్ రైస్: కిలో రూ.29కే..
RELATED ARTICLES