అనన్య న్యూస్, తిరుమల: టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఇందులో తీసుకున్న ప్రధాన నిర్ణయాలను ఛైర్మన్ మీడియాకు వెల్లడించారు.
– రూ.4.15 కోట్లతో తిరుమలలో అదనపు లడ్డూ కౌంటర్ల నిర్మాణానికి టెండర్ల ఆమోదం.
– రూ.2.35 కోట్లతో తిరుమల హెచ్విసి ప్రాంతంలోని 18 బ్లాకుల్లో గల 144 గదుల అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆమోదం.
– రూ.1.88 కోట్లతో జిఎన్సి, హెచ్విసి, ఏఎన్సి, ఎస్ఎన్సి ఉప విచారణ కార్యాలయాల ఆధునీకరణ, అభివృద్ధి పనులకు ఆమోదం.
– రూ.40.50 కోట్లతో తిరుమలలో వెస్ట్ ప్యాకేజికి గాను మూడు సంవత్సరాల కాలపరిమితికి ఎఫ్ఎంఎస్ సేవలను ముంబయికి చెందిన ఫెసిలిటీ అండ్ ప్రాపర్టీ మేనేజర్స్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థకు అందించేందుకు టెండర్లు ఆమోదం.
– అదేవిధంగా, రూ.29.50 కోట్లతో శ్రీవారి సేవాసదన్, వకుళామాత విశ్రాంతి గృహం, పిఏసి`3, 4, బి టైప్, డి టైప్ క్వార్టర్స్ ప్రాంతాల్లో ఎఫ్ఎంఎస్ సేవలను అదే సంస్థకు అప్పగించేందుకు టెండర్లు ఆమోదం.
– రూ.3.55 కోట్లతో తిరుమలలో పోలీస్ క్వార్టర్స్ అభివృద్ధికి పరిపాలన అనుమతి ఇవ్వడం జరిగింది.
– రూ.3.10 కోట్లతో తిరుమలలో వివిధ ప్రాంతాల్లో స్టెయిన్లెస్ స్టీల్ చెత్తకుండీల ఏర్పాటుకు పరిపాలన అనుమతి.
– రూ.5 కోట్లతో తిరుపతిలోని ఎస్వీ వేద వర్సిటీ ప్రాంగణంలో స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణానికి ఆమోదం.
– రూ.7.44 కోట్లతో టీటీడీలోని వివిధ విభాగాల అవసరాల కోసం వర్క్లోడ్ ప్రకారం కంప్యూటర్లు కొనుగోలుకు నిర్ణయం.
– రూ.9.50 కోట్లతో టీటీడీ పరిపాలన భవనంలో సెంట్రలైజ్డ్ రికార్డు స్టోర్ నిర్మాణానికి పరిపాలన అనుమతి ఇవ్వడం జరిగింది.
– 2024 సంవత్సరానికి గాను క్యాలెండర్లు, డైరీల ముద్రణకు నిర్ణయం.
– రూ.2 కోట్లతో నగరి సమీపంలోని బుగ్గలో శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీకాశీవిశ్వేశ్వరస్వామివారి ఆలయం వద్ద కల్యాణ మండపం నిర్మాణానికి ఆమోదం.
– రూ.4.15 కోట్ల శ్రీవాణి నిధులతో కర్నూలు జిల్లా, అవుకు మండలం, సీతారామపురం గ్రామంలోని శ్రీ పద్మావతి, గోదాదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి 4 రాజగోపురాల నిర్మాణానికి టెండర్లు ఆమోదం.
– స్విమ్స్ ఆసుపత్రిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి మరింత మెరుగైన వైద్యసేవలందించేందుకు రూ.97 కోట్లతో కార్డియో న్యూరో బ్లాక్, రూ.7 కోట్లతో సెంట్రలైజ్డ్ వంటశాల, రూ.7.75 కోట్లతో సెంట్రలైజ్డ్ గోడౌన్ నిర్మాణానికి టెండర్లు ఆమోదం.
– రూ.4 కోట్ల దాతల విరాళంతో ఒంటిమిట్టలో అన్నప్రసాద భవనం భవనం నిర్మాణానికి ఆమోదం.
– రూ.6.65 కోట్లతో తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి పుష్కరిణికి ఇత్తడిగ్రిల్స్ అమర్చడానికి టెండర్లు ఆమోదం.
– రూ.5.61 కోట్లతో తిరుపతిలోని రామానుజ సర్కిల్ నుండి రేణిగుంట వరకు బిటి రోడ్డు నిర్మాణానికి టెండర్లు ఆమోదం.
– నంద్యాల జిల్లా యాగంటిలో రూ.2.40 లక్షలతో టీటీడీ కల్యాణ మండపం నిర్మిస్తాం మని వెల్లడించారు .