Friday, March 14, 2025

ఖ‌మ్మం ప‌త్తి మార్కెట్‌లో అగ్నిప్ర‌మాదం..

అనన్య న్యూస్, ఖ‌మ్మం : ఖ‌మ్మం ప‌త్తి మార్కెట్‌లో శ‌నివారం మ‌ధ్యాహ్నం భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ప‌త్తి బ‌స్తాల‌కు మంట‌లు అంటుకున్నాయి. దీంతో మంట‌లు ఎగిసిప‌డ్డాయి. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేసింది.

ఈ అగ్నిప్ర‌మాదంలో 2000 పత్తి బ‌స్తాలు కాలిపోయిన‌ట్లు తెలుస్తోంది. భారీగా ఆస్తి న‌ష్టం జ‌రిగిన‌ట్లు మార్కెట్ అధికారులు అంచ‌నా వేస్తున్నారు. మంట‌లు ఎలా అంటుకున్నాయ‌నే విష‌యంపై స్ప‌ష్ట‌త లేదు. ఒక్క షెడ్డులో ఉన్న ప‌త్తి బ‌స్తాల‌న్నీ కాలి బూడిద‌య్యాయి. అయితే ఈ బ‌స్తాలు రైతుల‌కు సంబంధించిన‌వా.? లేక వ్యాపారుల‌కు సంబంధించిన‌వా.? అనే విష‌యం స్ప‌ష్టత రావాల్సి ఉంది.

Ananya News
Ananya Newshttps://ananyanews.in
Ananya News is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular