అనన్య న్యూస్, జడ్చర్ల: స్వరాష్ట్రంలోనే పల్లెల అభివృద్ధి జరిగిందని, తెలంగాణ వచ్చాకే గ్రామాలు అభివృద్ధి చెందాయని, పచ్చదనం, పరిశుభ్రత మెరుగు పడ్డాయని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం జడ్చర్ల మండలం నెక్కొండ గ్రామంలో పర్యటన సందర్భంగా గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, యాదవ కమ్యూనిటీ హాల్ లను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారంభించి, ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రామంలో పర్యటిస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ 2014 కు ముందు గ్రామాలు ఎలా ఉన్నాయో, ప్రస్తుతం ఎలా ఉన్నాయో బెరీజు వేసుకోవాలని పేర్కొన్నారు. నేడు ప్రతి పల్లెలో వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, ప్రతి పంచాయతీకి ట్రాక్టర్ కేటాయించడంతో పల్లెలు పచ్చదనం, పారిశుద్ధ్యంతో విరాజిల్లుతున్నాయన్నారు. కేంద్రం సైతం తెలంగాణ పల్లెలను మెచ్చి జాతీయస్థాయిలో అవార్డులు అందజేసిందని గుర్తు చేశారు. జాతీయస్థాయిలో అవార్డులు రావడమే మన పల్లెలు మెరుగుపడ్డాయని తెలపడానికి నిదర్శనం అని అన్నారు. కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.
స్వరాష్ట్రంలోనే పల్లెలు అభివృద్ధి: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
RELATED ARTICLES