అనన్య న్యూస్, హైదరాబాద్: బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తెలంగాణ కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ తెలంగాణ భవనల్ లో గురువారం బీఆర్ఎస్ రాష్ట్ర ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వచ్చే కొన్ని నెలల్లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీతో పాటు కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణ, పార్లమెంటు ఎన్నికలు సహా పలు అంశాలపై తమ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. సర్వేల విషయాన్ని ప్రస్తావించారు. నియోజకవర్గాల్లో జాగ్రత్తగా పని చేసుకోవాలని సూచించారు. మంచిగా పని చేసుకోవాలని మళ్లీ గెలవాలని అన్నారు. సరిగ్గా పనిచేయని ఎమ్మెల్యేల తోకలు కత్తిరిస్తానని అన్నారు. పద్దతులు మానకుంటే సీటు ఉండదని హెచ్చరించారు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని పేర్కొన్నారు. అక్టోబర్ లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో ప్రజా ప్రతినిధులందరూ ఆయా నియోజకవర్గాలలోనే ఉంటూ ప్రజలతో మమేకం అవ్వాలని సూచించారు.
వ్యక్తిగత ప్రతిష్ఠకు పోకుండా పార్టీ కోసం కలిసి పని చేయాలని చెప్పారు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని తెలిపారు. మిగతా నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి సమస్య ఉంటే లీడర్లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవద్దని చెప్పారు. అందరూ ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. ఎలాంటి సమస్య ఉన్నా అధిష్ఠానంతో విన్నవించుకోవాలని అన్నారు. దాహం వేసినప్పుడు బావి తవ్వాలంటే అది కాని పని అని అన్నారు. కాగా తెలంగాణ ఏర్పడ్డాక అనేక రాష్ట్రాల మోడల్స్ ను తెప్పించానని, రాష్ట్రంలో ఎటువంటి కార్యక్రమాలు అమలు చేయాలని ఆలోచించామని అన్నారు.
అబ్ కి బార్ కిసాన్ సర్కార్:
అబ్ కి బార్ కిసాన్ సర్కార్ నినాదంతో బీఆర్ఎస్ ముందుకు వెళ్తుందని అన్నారు. భారత్ ను ప్రగతి పథంలో నడిపేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నామని తెలిపారు. పోరాటాలతో ఏదైనా సాధించవచ్చని స్వరాష్ట్ర సాధనతో నిరూపించామని, పంటల సాగుపై అధికారులు రైతులను చైతన్యవంతం చేయాలని చెప్పారు. మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు అధికంగా ఉన్నాయని తెలిపారు. అక్కడి సర్కారుకి విజన్ లేదని విమర్శించారు. తలసరి విద్యుత్ వాడంలోనూ తెలంగాణ అగ్రస్థానంలో కొనసాగుతోందని, అలాగే మార్చి లోనే పంటలు చేతికొచ్చే విధంగా ముందుగా రైతులు నాట్లు వేసేలా ప్రజా ప్రతినిధులు వ్యవసాయ అధికారులతో కలసి రైతులను చైతన్య పరచాలని కోరారు..