అనన్య న్యూస్, సిద్దిపేట: మీరు నాపై చూసిస్తున్న ప్రేమకు నా కళ్లల్లో నీళ్లు వస్తున్నయ్. మీ ఆదరణకు ఎంత చేసినా తక్కువే. ఇంకా మీకు చాలా సేవ చేయాలి’ అంటూ మంత్రి హరీశ్రావు భావోద్వేగానికి గురయ్యారు. ఆదివారం సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ లో నిర్వహించిన బీర్ఎస్ ఆత్మీయ సమేళనంలో మంత్రి హరీష్ రావు భావోద్వేగానికి గురయ్యారు. ఇంత ఆదరాభిమానాలు చూస్తుంటే నాకు దుఃఖం వస్తుంది. ఇంత ఉత్సాహం చూస్తుంటే నాకు ఆనందం ఐతుంది. నా చివరి శ్వాస వరకు మీకు సేవ చేస్తా. నా చర్మం వొలిచి చెప్పులు కుట్టించినా తక్కువే అంటూ మంత్రి హరీష్ రావు ఏమోషనల్ అయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. గతంలో వర్షాలు లేక కప్ప తల్లి ఆటలు ఆడేవారని..కానీ ఇప్పుడు మండు ఎండల్లో సైతం చెరువులు మత్తలు దుంకుతున్నాయన్నారు. 2014 కంటే ముందు పండిన పంటల కంటే తెలంగాణ వచ్చాక ప్రాజెక్ట్ లు కట్టిన తర్వాత ఎక్కువ పంటలు పండాయని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ పాలనలో జరిగిన అభివృద్ధి కంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి ఎక్కువ అయిందన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం సహకరించడం లేదని మోడీ అంటున్నారని..మరి తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందకుండా బీజేపీ అడ్డుకుంటోందని విమర్శించారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉందని కానీ అక్కడ ఇప్పటికీ కరెంట్ లేక 20 లక్షల ఆయిల్ ఇంజన్లు నడుతుస్తున్నాయని ఎద్దేవా చేశారు.