Friday, March 14, 2025

తెలంగాణలో అభివృద్ధికి సహకరించడం లేదు: ప్రధాని మోడీ

అనన్య న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నఅనేక అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదని ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం అభివృద్ధి పనులు ప్రారంభించటానికి హైదరాబాద్ వచ్చిన ప్రధాన మంత్రి మోడీ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ప్రసంగించారు. రాష్ట్రంలో కుటుంబం, అవినీతి పాలన నడస్తుందన్నారు. అధికార పార్టీ పేరు ఎత్తుకుండానే ఎవరి పేరు ప్రస్తావించకుండానే తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ తీరును విమర్శించారు. కుటుంబ పాలనకు విముక్తి కలగాలని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వం వల్ల ప్రజలకు ఎంతో నష్టం జరుగుతుందని, అదే నా బాధ, ఆవేదన అన్నారు. మేం ప్రజల కోసం పని చేస్తుంటే కొందరు మాత్రం అవినీతికే పనులు చేస్తున్నారని రాష్ట్ర పాలనపై విమర్శలు, ఆరోపణలు చేశారు. ప్రతి ప్రాజెక్టులో కుటుంబ సభ్యుల ఆసక్తి తప్ప ప్రజల ప్రయోనాలు చూడట్లేదన్నారు.

అవినీతి, కుటుంబ పాలన వేర్వేరు కాదని అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలా.. వద్దా అంటూ ప్రజలను ప్రశ్నించారు. కుటుంబ పాలకులే అన్నింటిపైనా అధికారాన్ని కోరుకుంటారని అలాంటి వారి వల్ల ప్రజలకు నష్టమన్నారు. అలాంటి వ్యక్తుల నుంచి తెలంగాణను కాపాడాల్సిన అసవరం ఉందా లేదా అంటూ ప్రజలను ప్రశ్నించారు.

అవినీతిపై పోరాడాలా వద్దా.. అవినీతిని తరిమి కొట్టాలా వద్దా.. తెలంగాణ ప్రజలు చెప్పాలంటూ పిలుపునిచ్చారు మోడీ. అవినీతి చిట్టా బయటకు వస్తుందనే భయంతోనే విపక్షాలు అన్నీ కోర్టుకు వెళ్లాయన్నారు. అవినీతిపరులపై పోరాటానికి తెలంగాణ ప్రజల సహకారం కావాలని మోడీ కోరారు. బీజేపీని అశీర్వదిస్తే రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు

Ananya News
Ananya Newshttps://ananyanews.in
Ananya News is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular