అనన్య న్యూస్, జడ్చర్ల: అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు అనురాగిని ఆశ్రమం ఆవరణలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని మంగళవారం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కంటి పరీక్షలు చేయించుకోవాలని, దృష్టిలోపం ఉన్నవారు కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వమే ఉచితంగా అద్దాలు అందజేస్తుందని, అవసరమైన వారికి కంటి వైద్యం, శస్త్ర చికిత్సలు ఉచితంగా నిర్వహిస్తుందని అన్నారు. కంటి వెలుగు శిబిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించాలని వైద్యులకు సూచించారు. శిబిరంలో పరీక్షలు నిర్వహించుకున్న పలువురికి ఎమ్మెల్యే కంటి అద్దాలు పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్కరు కంటి చూపు సమస్యతో ఇబ్బంది పడకూడదని సీఎం కేసీఆర్ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి, కమిషనర్ మహమూద్ షేక్, కౌన్సిలర్ రఘురాం గౌడ్, నాయకులు దోరేపల్లి రవీందర్, రామ్మోహన్, రఘుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యం: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
RELATED ARTICLES