- మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ.
- జడ్చర్ల ఎర్రగట్టలో 560 డబల్ బెడ్ రూమ్ ఇండ్లు సిద్ధం..
అనన్య న్యూస్, జడ్చర్ల : జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు ఎర్రగుట్ట వద్ద నిర్మించిన 560 డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ఈనెల 8న గురువారం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఇండ్ల పట్టాలు పంపిణీ చేస్తారని బుధవారం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందజేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో, అనంతరం నిర్వహించే సభలో పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.