అనన్య న్యూస్, హైదరాబాద్: తెలంగాణకు హైదరాబాద్ వాతావరణశాఖ వర్షసూచన జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందని అంచనా వేసింది. 21వ తేదీ జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్ధిపేట జిల్లాల్లో వానలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొన్నారు. ఈదురుగాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పలుచోట్ల కురుస్తాయని తెలిపింది. ఇక 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని అంచనా వేసింది.
వాతావరణశాఖ అలర్ట్ ఈ జిల్లాల్లో 5 రోజుల పాటు వర్షాలు..
RELATED ARTICLES