అగ్ని ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోంది.. మంత్రి తలసాని
అనన్య న్యూస్: సికింద్రాబాద్ స్వప్నలోక్ అగ్నిప్రమాద మృతుల కుటుంబ సభ్యులను గాంధీ ఆస్పత్రిలో శుక్రవారం హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మీ పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపు నుంచి మంత్రి తలసాని ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అగ్నిప్రమాద ఘటన చాలా బాధాకరమని అన్నారు.
అగ్ని ప్రమాదంపై అన్ని కోణాల్లో దర్యాప్తు:
స్వప్న లోక్ అగ్నిప్రమాదంపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. సిటీలో దాదాపు 30 నుంచి 40 లక్షల వరకూ అక్రమంగా కట్టిన బిల్డింగులు ఉన్నాయని, వాటి యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మృతులకు పోస్టుమార్టం పూర్తయిన తర్వాత ప్రభుత్వ అంబులెన్సుల్లోనే వారి సొంత గ్రామాలకు డెడ్ బాడీలను తరలిస్తామని తెలిపారు. అగ్ని ప్రమాదానికి గురైన స్వప్నలోక్ కాంప్లెక్స్ ను సీజ్ చేస్తామని పేర్కొన్నారు.
ఫైర్ సేఫ్టీ నిబంధనలు కంపల్సరీ:
అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎక్కడికక్కడ అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని వ్యాపార సముదాయ నిర్వాహకులను హెచ్చరిస్తున్న, ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగడం దురదృష్టకరమన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కొంతమందిని రెస్క్యూ ఫైర్ సిబ్బంది కాపాడారని అన్నారు. 6 గురు మాత్రం 5వ అంతస్తులోనే చిక్కుకోవడంతో ఊపిరి ఆడక పొగ పీల్చుకుని చనిపోయారని, చనిపోయిన వారు క్యూనేట్ అనే సంస్థలో పని చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తెలిసిందన్నారు. ప్రభుత్వ సహాయంతో పాటు క్యూనెట్ నుండి మృతుల కుటుంబ సభ్యులకు సాయం అందేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
అగ్ని ప్రమాదాలు జరగకుండా అన్ని అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, 40 ఏళ్ల నాటి పాత బిల్డింగులు, ఫైర్ సేఫ్టీ లేని భవనాలు హైదరాబాద్ లో సుమారుగా 30 నుంచి 40 లక్షల వరకు ఉన్నాయనీ వీటిపై చర్యలు తీసుకోవాలంటే చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని, ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీం బాధితులను కాపాడేందుకు ఎంతో శ్రమించారని అన్నారు.