అనన్య న్యూస్, హైదరాబాద్: తెలంగాణ పునర్నిర్మాణ ఆకాంక్షను అర్థం చేసుకోలేక కొంత మంది హేళన చేశారని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం అంకితభావంతో అడుగేసే సమయంలో తెలంగాణ భావాన్ని, నిర్మాణాన్ని కాంక్షను జీర్ణించుకోలేని కొందరు పిచ్చివారు కారుకూతలు కూశారు. మొత్తం తెలంగాణనే కూలగొట్టి కడుతారా? అని వ్యాఖ్యలు చేశారు. సచివాలయం కులుస్తారా అంటూ తప్పుడు ప్రచారం చేశారని ఇప్పుడు వారికి బుద్ధి వచ్చేలా ఆకాశమంత అద్భుతమైన సచివాలయాన్ని నిర్మించామని, అంబేద్కర్, గాంధీజీ చూపించిన మార్గంలోనే తెలంగాణ సాధించామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ పరిపాలనకు అత్యంత శోభయానంగా నిర్మించిన సచివాలయం నాచేతుల మీదుగా ప్రారంభించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం కొత్త సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సచివాలయం ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ సచివాలయం నిర్మాణంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సచివాలయం తరహాలోనే తెలంగాణ పల్లెలు కూడా వెలిగిపోతున్నాయని అన్నారు.
అంతర్జాతీయ నగరాలకు ధీటుగా తెలంగాణ రూపుదిద్దుకుంటుందున్నదని అన్నారు. కరెంట్ షాక్లతో రైతులు చనిపోయారు. కానీ నేడు 24 గంటల కరెంట్తో రైతులు కంటి నిండా నిద్ర పోతున్నారు. గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయి. అనేక అవార్డులు సొంతం చేసుకుంటున్నాయి. ఆగమైపోయిన అడవులు పునర్నిర్మాణం చేసుకున్నాం. హరితశోభను వెద జల్లుతున్నాయి. వలసపోయిన పాలమూరు వాసులు తిరిగొచ్చి తమ పొలాల్లో పనులు చేసుకుంటున్నారు. కూలీలు సరిపోక ఇతర రాష్ట్రాల కూలీలు పాలమూరుకు వస్తున్నారు. ఇది తెలంగాణ పునర్నిర్మాణం. మిషన్ భగీరథ తెలంగాణ పునర్నిర్మాణానికి ప్రతీక. హైదరాబాద్లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రజలు తాగే నీటిని ఆదిలాబాద్లోని గోండు ప్రజలు సైతం తాగుతున్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణలో మత కల్లోలాలు లేవు. మహిళలకు భరోసానిస్తూ భరోసా కేంద్రాలు, షీ టీమ్స్ పని చేస్తున్నాయి. అరాచక ముఠాలను నివారిస్తున్నాం. సమ్మిళిత అభివృద్ధితో ముందుకు పోతున్నాం. పారిశ్రామిక రంగంలో లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఐటీ విధానంలో బెంగళూరును దాటి పోతున్నాం. మురికి కూపాలుగా ఉన్న పట్టణాలను అభివృద్ధి చేస్తున్నాం. పచ్చదనం, డంపుయార్డులతో, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లతో పట్టణాలు, గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి.
అంతర్జాతీయ నగరాలకు ధీటుగా రూపుదిద్దుకుంటుంది తెలంగాణ. అండర్ పాస్లు, ఫ్లై ఓవర్లు, లింక్ రోడ్లతో హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది. నగరం నలుదిక్కులా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మిస్తున్నాం. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుంది. ప్రపంచంలో అభివృద్ధిని, పునర్నిర్మాణాన్ని కొలమానంగా తీసుకునే సూచికలు రెండే రెండు ఉన్నవి. ఒకటి పర్ క్యాపిట ఇన్కం. రెండోది పర్ క్యాపిట పవర్ యుటిలైజేషన్. ఇవి నిజమైన అభివృద్ధి సంకేతాలు. నేషనల్, జాతీయ స్థాయిలో ముందున్నాం. తెలంగాణ వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ, దేశంలోనే నంబర్ వన్ స్థాయికి పర్ క్యాపిటలో ముందున్నాం. పవర్ యుటిలైజేషన్లో 2,140 యూనిట్లతో దేశంలోనే అగ్రభాగాన ఉన్నాం. ఆసరా పెన్షన్లతో పేదల ముఖాల్లో చిరునవ్వులు చూస్తున్నాం. సచివాలయం నిర్మాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను అన్నారు.