- ప్రభుత్వాన్ని బదులాం చేసేందుకే బీజేపీ ప్రశ్నాపత్రాల లీకేజీ డ్రామా
అనన్య న్యూస్, జడ్చర్ల: అధికారం కోసమే ప్రతిపక్ష పార్టీలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బదులాం చేసేందుకే బీజేపీ నాయకులు కార్యకర్తలతో కుట్రపూరితంగా టీఎస్పీఎస్సీ, 10వ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆరోపించారు. బుధవారం జడ్చర్లలోని ఎమ్మెల్యే తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పేపర్ లీకేజీ వ్యవహారాల గురించి ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని అన్నారు. 10వ తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ వెనుక బండి సంజయ్ పాత్ర ఉందని తెలిసి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిందని అన్నారు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణల్లో అర్థం లేకుండా ఉందని అన్నారు. సీఎం కేసీఆర్ రాష్టంలో దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, కౌన్సిలర్లు సతీష్, నందకి షోర్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, మాజీ సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, ముడా డైరెక్టర్లు శ్రీకాంత్, ఇంతియాజ్ ఖాన్, శ్రీశైలం యాదవ్, నాయకులు రామ్మోహన్, మురళి తదితరులు ఉన్నారు.