- జలపాతాలు, చెరువులు, వాగులు సందర్శించే ప్రాంతాల్లో పొంచి ఉన్న ముప్పు..
- పిల్లల ప్రాణాలను తీస్తున్న ఈత..
- తల్లిదండ్రులారా తస్మాత్ జాగ్రత్త..
- సెలవుల్లో పిల్లలపై కన్నేసి ఉంచండి..
అనన్య న్యూస్: పాఠశాలలకు సెలవులు రావడంతో పిల్లల పట్ల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత పనిలో ఉన్న సరే పిల్లలపై ఓ కన్నేసి ఉండాలి. పిల్లల పట్ల అప్రమత్తంగా లేకుంటే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. ప్రమాదం జరగకుండా ముందస్తుగానే జాగ్రత్తలు పాటించడం మంచిదని గ్రహించండి.
పిల్లల పట్ల ఈ జాగ్రత్తలు పాటిద్దాం:
- పిల్లలను బావుల్లో, అలాగే చెరువుల్లో ఈత కొట్టేందుకు పంపించకండి.
- అవసరమైతే మీరే స్వయంగా వారికి తోడుగా వెళ్లండి.
- మోటార్సైకిల్ నడపమని వారి చేతికి తాళాలు ఇవ్వకండి.
- మొబైల్ ఫోన్లు, ట్యాబ్లు వారి చేతికి ఇవ్వకండి.
- స్నేహితులతో కలిసి దూరప్రాంతాలకు పంపకండి
- మధ్యాహ్న సమయంలో ఆరుబయట ఆడుకోవడానికి అనుమతించకండి.
- ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే ఆడుకోవడానికి వారికి అనుమతినివ్వండి.
- ఇంట్లో పెద్దలతో వారు ఎక్కువ సమయం గడిపేలా చూడండి.
- వీలైనంత వరకు పిల్లలను ఇంట్లోనే ఉంచుకుని మన సంప్రదాయాలను నేర్పించాలి.
- సంప్రదాయ పనులు గురించి వారికి చెప్పాలి.
- ఇలా జాగ్రత్తలు పాటించినట్లయితే ఈ వేసవి సెలవులు ఇట్టే గడిచిపోతాయి..