అనన్య న్యూస్, జడ్చర్ల: జిల్లాకు ఒక మెడికల్ కళాశాల, బస్తీ దవాఖానాలు, టీ డయాగ్నొస్టిక్ సెంటర్లు, హాస్పిటల్స్ అప్ గ్రేడేషన్ తో రాష్ట్రం వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల చంద్ర గార్డెన్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య ఆరోగ్య దినోత్సవంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్కారు దవాఖానాలోనే నేడు డయాలసిస్ సేవలు సైతం అందుతున్నాయని, టీ డయాగ్నస్టిక్స్ సెంటర్లో 55 రకాలకు పైగా పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇటీవలే జడ్చర్ల లో వంద పడకల దవాఖాన ప్రారంభించు కున్నామని, డయాలసిస్ ఐసీయూ, ఎమర్జెన్సీ కేర్ వంటి సేవలతో పేదలకు అన్ని రకాల మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. గతంలో ప్రభుత్వ దవాఖానాలలో ఎర్ర గోలి పచ్చ గోలి తప్ప సరైన వైద్యం కూడా అందేది కాదన్నారు. ప్రస్తుతం దవఖానలో వైద్య సేవలు ఎలా ఉన్నాయో ప్రజలే గమనించాలన్నారు. పనిచేసే ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు.
ఉత్తమ డాక్టర్లకు, స్టాఫ్ నర్స్ ల, వైద్య సిబ్బందికి మెమెంటోళ్లను, ప్రశంస పత్రాలను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, జడ్పీ సీఈవో జ్యోతి, డిస్టిక్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ శంకర్, ఏరియా హాస్పిటల్ సూపర్ డెంట్ డాక్టర్ సోమశేఖర్, లెప్రసీ, ఎయిడ్స్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ జరీనా భాను, గంగాపూర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శివకాంత్, మిడ్జిల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మనుప్రియ, జడ్చర్ల యుపిహెచ్సి డాక్టర్ సమత, బాలనగర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సృజన, జడ్చర్ల ఆర్ బి ఎస్ కే డాక్టర్ సునీల్, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.