అనన్య న్యూస్, జడ్చర్ల: తెలంగాణ వచ్చాకే బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ముస్లిం మైనార్టీల సంక్షేమం సాధ్యమైందని, 55 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్నారే తప్ప వారికి ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు చేయలేదని జడ్చర్ల బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం జడ్చర్ల లోని ఆర్కే గార్డెన్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమ్మేళనానికి ముస్లిం సోదరులు వేలాదిగా తరలివచ్చారు. సమ్మేళనంలో పాల్గొన్న వక్ప్ బోర్డు రాష్ట్ర అధ్యక్షుడు మసీ ఉల్లాఖాన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ముస్లింల సంక్షేమానికి అనేక పథకాలు చేపట్టారని, గతంలో కాంగ్రెస్ హయాంలో అల్లర్లు తప్ప ప్రశాంతత లేదని నేడు బిఆర్ఎస్ పాలనలో జనం ప్రశాంతంగా ఉన్నారని అన్నారు.
ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గత పది ఏళ్లలో ముస్లిం మైనారిటీలకు షాదీ ముబారక్, ఇమామ్ మౌజంలకు గౌరవ వేతనం, మైనార్టీ ఓవర్సీస్ పథకం, మైనార్టీ బందు, ప్రత్యేక మైనార్టీ గురుకులాలు లాంటి ఎన్నో పథకాలు అమలు చేసి వారి సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకు గానే వాడుకుందని విమర్శించారు. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తూ, గంగా జమున తెహజీబ్ గా తెలంగాణ ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించాలని, కారు గుర్తుకు ఓటేయాలని అభివృద్ధిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మైనార్టీ సెల్ అధ్యక్షుడు అబ్దుల్ సోహెల్, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు హాది, నాయకులు తదితరులు ఉన్నారు.