Saturday, March 15, 2025

ఉద్యోగాల పేరిట యువతను మోసంచేస్తున్న ముఠా అరెస్టు..

అనన్య న్యూస్, కరీంనగర్: నిరుద్యోగులైన అమాయక యువతకు ఉద్యోగాల పేరిట మోసం చేసి వారి వద్ద నుండి లక్షల రూపాయలు దండుకుంటూ ఆపై ముఖం చాటేసి, యువతను నిలువునా ముంచుతున్న ముఠాను కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. మంచిర్యాల జిల్లా ఇందారం గ్రామానికి చెందిన భాస్కర్, పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మధుమూర్తి, చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన వైకుంఠం, మరో ఇద్దరితో కలిసి ఒక ముఠాగా ఏర్పడి గత కొన్ని సంవత్సరాలుగా నిరుద్యోగ యువకుల కు ఉద్యోగం ఇప్పిస్తానని వారి వద్ద లక్షలు వసూలు చేసుకుంటూ ముఖం చాటేసి వారిని ముంచడం చేస్తున్నారు. వీరి వల్ల నష్టపోయిన బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ నటేష్ నిందితుల ముఠాను అరెస్టు చేయుటకు వారి కదలికలపై నిఘా ఉంచి వారిని అదుపులోకి తీసుకునుటకు ఒక ప్రత్యేక బృందాన్ని ఎస్సై రహీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది.

ప్రత్యేక బృందం నిందితుల కదలికలపై నిఘా ఉంచి వారిని మంగళవారం అదుపులోకి తీసుకొని వారిని విచారించగా వారు తమ నేరాన్ని అంగీకరించడంతో పాటు గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నామని తెలియజేసినారు. వారి వద్ద నుండి 93 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.అరెస్టు చేసిన నిందితులు కోర్టులో హాజరు పరిచి వీరు ఇంకా ఎంతమందిని మోసం చేసినారని ఎంత మంది వద్ద ఉద్యోగాల పేరిట డబ్బులు వసూలు చేసినారు అనే విషయంపై లోతుగా విచారణ చేసి తదుపరిచర్యలకు ఉపక్రమించడం జరుగుతుందని కరీంనగర్ ఏసిపి తులా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

Ananya News
Ananya Newshttps://ananyanews.in
Ananya News is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular